3 లక్షల దిగువకు కొత్త కేసులు.. 4 వేలకు పైగానే

దేశంలో కరోనా కేసులు 3 లక్షల దిగువకు నమోదయ్యాయి. కానీ మరణాలు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. గడిచిన 24 గంటల్లో నాలుగు వేలమందికి పైగా ప్రాణాలను బలితీసుకుంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 15,73,515 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 2,81,386 మందికి పాజటివ్గా తేలింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 2,49,65,463కి చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి 4,106 మంది మృతి చెందగా, ఇప్పటి వరకు 2,74,390 మంది మరణించారు. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 3,78,741 మంది డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు 2,11,74,076 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ప్రస్తుతం 35,16,997 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు దేశంలో 31,64,23,658 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. దేశంలో ఇప్పటి వరకు 18.29 కోట్ల వ్యాక్సినేషన్ పూర్తి చేశారు.