దేశంలో కరోనా విజృంభణ… 4 లక్షలకు పైగా కేసులు

దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. దీంతో రోజువారీ కేసులు మరోసారి నాలుగు లక్షలు దాటాయి. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,12,262 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,10,77,410 దాటాయి. ఇందులో 1,72,80,844 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 35 లక్షల మార్కును దాటింది. ప్రస్తుతం 35,66,398 మంది బాధితులు కరోనా చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో 3980 మంది వైరస్ వల్ల మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 2,30,168కు చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 24.8 శాతానికి చేరిందని వెల్లడించింది. ఇప్పటివరకు 16,25,13,339 మంది వ్యాక్సిన్ పంపిణీ చేశామని తెలిపింది.