భారత్ మరో కీలక మైలురాయిని దాటింది

కొవిడ్ వ్యాక్సినేషన్లో భారత్ మరో కీలక మైలురాయిని దాటింది. ప్రజలకు అందించిన టీకా డోసుల సంఖ్య 95 కోట్లు దాటింది. దేశవ్యాప్తంగా 46.48 లక్షల డోసులు వేశారు. దీంతో ఇంతవరకు ప్రజలకు అందించిన టీకా డోసుల సంఖ్య 95.12 కోట్లు దాటింది. దేశంలో జనవరి 16 నుంచి కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే.