దేశంలో కరోనా విజృంభణ 24 గంటల్లో

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో 3,82,315 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. మరో 3,780 మంది మరణించారు. తాజాగా 3,83,439 మంది కోలుకున్నారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,06,65,148కు పెరగ్గా, ఇప్పటి వరకు 1,69,51,731 మంది కోలుకున్నారు. మరో 2,26,188 మంది వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 34,87,229 యాక్టివ్ కేసులు ఉన్నాయి. టీకా డ్రైవ్లో భాగంగా ఇప్పటి వరకు 16,04,94,188 డోసులు వేసినట్లు ఆరోగ్యశాఖ వివరించింది.