కాస్త తగ్గిన ఉద్ధృతి…కొత్తగా 3.23 లక్షల కేసులు

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తోంది. కట్టడికి పలు రాష్ట్రాలు లాక్డౌన్, నైట్కర్ఫ్యూతో పాటు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నా మహమ్మారి తీవ్రత కొనసాగుతున్నది. ఇప్పటికే భారత్లో ప్రపంచ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 16,58,700 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 3,23,144 కొత్త కేసులు బయటపడ్డాయి. తాజాగా 2,771 మరణాలు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. తాజాగా 2,51,857 మంది కోలుకొని ఇండ్లకు వెళ్లారని పేర్కొంది. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,76,36,307కు పెరిగింది. ఇప్పటి వరకు 1,45,56,209 మంది కోలుకున్నారు. వైరస్ బారినపడి మొత్తం 1,97,894 మంది ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం దేశంలో 28,82,204 యాక్టివ్ కేసులున్నాయని తెలిపింది. ఇప్పటి వరకు 14,52,71,186 డోసులు వేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.