మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు కరోనా పాజిటివ్

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో చికిత్స నిమిత్తం ఆయనను ఢిల్లీలోని ఏయిమ్స్కు తరలించారు. అయితే ఆయన కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల తొందరగానే ఉపశమనం పొందే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. మార్చి 4 న మన్మోహన్ దంపతులు ఏయిమ్స్లో కరోనా వ్యాక్సిన్ మొదటి మోతాదును తీసుకున్నారు.