ప్రపంచంపై మళ్లీ కరోనా పంజా… రికార్డు స్థాయిలో కేసులు

ప్రపంచంపై మళ్లీ కరోనా పంజా విసురుతున్నది. రికార్డు స్థాయిలో రోజువారీ కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా తాజాగా 16.39 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అమెరికా, బ్రిటన్, స్పెయిన్, ఫ్రాన్స్లో లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. ఫ్రాన్స్లో గడిచిన 24 గంటల్లో 2 లక్షలకు కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో 110 మంది ప్రాణాలు కోల్పోగా 43 వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం మరణాలు 1,23,851కి చేరాయి. ఇప్పటి వరకు 81,34,85ల మంది కరోనాను జయించారు. ఫ్రాన్స్ తరువాత అమెరికాలో భారీగా కేసులు నమోదయ్యాయి. ఇక్కడ 1,61,398 మంది కరోనా బారినపడ్డారు. 257 మంది చనిపోయారు. ఇప్పటి వరకు 5.58కోట్ల మంది కరోనా బారిన పడగా, 8.47 లక్షల మంది మరణించారు. ఆ తరువాత ఇటలీలో 1,41,262 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 62.66 లక్షలకు చేరాయి. 1.37 లక్షల మరణాలు సంభవించాయి.