దేశంలో తగ్గుతున్న కేసులు.. పెరుగుతున్న మరణాలు

దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ వ్యాప్తి కొనసాగుతోంది. అయితే వరుసగా మూడో రోజూ కరోనా యాక్టివ్ కేసులు తగ్గుదల కనిపించగా, మరణాలు మాత్రం మరోమారు నాలుగు వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,48,421 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకే రోజు 4,205 మంది మృతి చెందారు. 24 గంటల్లో 3,55,338 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,33,40,938 చేరింది. మరణాల సంఖ్య 2,54,197కు పెరిగింది. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 37,04,009 యాక్టివ్ కేసులున్నాయి. మహమ్మారి నుంచి ఇప్పటి వరకు 1,93,82,642 మంది బాధితులు కోలుకున్నారు. అదేవిధంగా 17,52,35,991 మందికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశామని వెల్లడించింది.