తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కరోనా

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో 1,20,043 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1,556 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. కరోనాతో 14 మంది మృతి చెందారు. 24 గంటల్లో 2,078 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,993 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనాతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 3,510 మంది మరణించారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 182 కేసులు నమోదయ్యాయి.