దేశంలో మళ్లీ స్వల్పంగా పెరిగిన.. కేసులు

దేశంలో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 62,224 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మరో 2,542 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల్లో 1,07,628 మంది బాధితులు కొలుకోని డిశ్చార్జి అయ్యారు. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,96,33,105కు చేరింది. ఇప్పటి వరకు 2,83,88100 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్ బారినపడి 3,79,573 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 8,65,432 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు 26.19 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.