దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,100 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,08,47,304కు చేరింది. మరో 14,016 మంది డిశ్చార్జి కాగా, కోలుకున్న వారి సంఖ్య 1,05,48,521కు పెరిగింది. మరో 78 మంది మృత్యువాతపడగా.. మొత్తం మృతుల సంఖ్య 1,55,158కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 1,43,625 క్రియాశీల కేసులున్నాయని మంత్రిత్వశాఖ పేర్కొంది.
ఇప్పటి వరకు 62,59,008 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు చెప్పింది. ఇదిలా ఉండగా కరోనా పరీక్షలు భారీగానే సాగుతున్నాయి. కొవిడ్ పరీక్షలు 20 కోట్లకు పైగా పరీక్షలు చేరుకున్నాయి. ఒకే రోజు దేశవ్యాప్తంగా 6,87,138 టెస్టులు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ పేర్కొంది. ఇప్పటి వరకు 20,58,87,752 నమూనాలను పరిశీలించినట్లు చెప్పింది.