దేశంలో కరోనా ఉధృతి తగ్గుముఖం….

దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 1,00,636 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,89,09,975కు చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. 2,71,59,180 మంది కరోనా నుంచి కోలుకోగా 14,01,609 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 2,427 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు 3,49,186 మంది మరణించారు. కొత్తగా 1,74,399 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. దేశంలో ఇప్పటివరకు మొత్తం 23,27,86,482 మందికి వ్యాక్సిన్ పంపిణీ చేశామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.