దేశంలో మళ్లీ పెరిగిన.. కరోనా కేసులు

భారత్లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. అయితే నిన్నటితో పోల్చితే దేశంలో స్వల్పంగా కరోనా కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 67,208 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. 24 గంటల్లో 2,330 మంది మృతి చెందారు. దీంతో కరోనాతో దేశంలో మొత్తం 3,81,903 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల్లో 1,03,570 మంది బాధితులు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు మొత్తం 2,84,91,670 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 8,26,740 పాజిటివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు 26,55,19,251 మందికి పైగా కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.