200 కోట్ల డోసులు విరాళం అందిస్తాం

కరోనా మహమ్మారిపై పోరులో ప్రపంచ దేశాలకు అండగా నిలుస్తామని చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్ భరోసా ఇచ్చారు. ఈ ఏడాది 200 కోట్ల డోసుల టీకాలను విరాళంగా అందిస్తామని ప్రకటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆధ్వర్యంలో కొవాక్స్ కూటమికి సుమారు రూ.740 కోట్లు సమరకూరుస్తామని కూడా హౄమీ ఇచ్చారు. కొవిడ్ -19 టీకా సహకారానికి సంబంధించి నిర్వహించిన అంతర్జాతీయ సదస్సుకు జిన్పింగ్ తన సందేశాన్ని లేఖ రూపంలో పంపించారు.