కరోనా జాగ్రత్తలు అవసరం…లేకపోతే…?
కరోనా పట్ల అప్రమత్తంగా లేకపోతే.. దేశవ్యాప్తంగా మరోసారి లాక్డౌన్ తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మానవతప్పిదాల వల్ల కరోనా మళ్ళీ విజృభిస్తోందని మోగుతున్న ప్రమాద ఘంటికలను వివరిస్తూ అప్రమత్తం చేస్తున్నారు. కరోనా పట్ల భవిష్యత్తులో చాలా అప్రమత్తంగా ఉండాలని సిసిఎంబి డైరెక్టర్ రాకేష్ మిశ్రా హెచ్చరించారు.
మానవ తప్పిదాల వల్ల కరోనా చాలాచోట్ల విజ•ంభిస్తుందని, ప్రస్తుతం భారత్లో ఢిల్లిలో మాత్రమే సెకండ్ వేవ్ కనిపిస్తోందని అన్నారు. సెకండ్ వేవ్ అంటే భయపడడానికి చాలా కారణాలు ఉన్నాయని, వ్యాక్సిన్ గురించి ఆలోచించడం కంటే కరోనాపట్ల అప్రమత్తంగా ఉండడం ఈ పరిస్థితుల్లో మంచిదని అన్నారు. సెకండ్ వేవ్ వస్తే చాలా కష్టమన్న ఆయన ఢిల్లిలో సెకండ్ వేవ్ ఉందన్నారు. ఈ వైరస్ మన చుట్టూనే ఉందన్న సంగతి మర్చిపోవద్దని పేర్కొన్నారు. కొన్నిసార్లు ఈ సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని, పండగలు, పెళ్ళిళ్లలో జాగ్రత్తలు పాటించకపోతే మళ్ళీ లాక్డౌన్ తప్పనిసరి అవుతుందని ఆయన పేర్కొన్నారు. 60 నుంచి 70 శాతం యాంటీబాడీలు వచ్చి హెర్డ్ ఇమ్యూనిటీ లేదా వ్యాక్సిన్ వచ్చేదాకా ఈ వేవ్లు వస్తూనే ఉంటాయని రాకేశ్ పేర్కొన్నారు. దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ అందాలంటే ఈ ఏడాది నుంచి మరో రెండేళ్ళు పడుతుందని, అందుకే మాస్కు, శానిటేషన్, భౌతిక దూరంతోనే వైరస్ని జయించాలని ఆయన పేర్కొన్నారు.






