కల్లు తాగితే కరోనా తుస్సు అంట

కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి ఇంత పెద్ద ఎత్తున ప్రయోగాలూ, వ్యాక్సిన్ తయారీలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు ఓ బీఎస్పీ నాయకుడు సెలవిస్తున్నారు. హాయిగా కల్లు తాగితే కరోనా మటాష్ అయిపోతుందని కూడా అభయమిస్తున్నారు. యూపీకి చెందిన బీఎస్పీ నేత బీమ్ రాజ్ భర్ కల్లు బాగా తాగి కరోనా భయం లేకుండా జీవించాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన కల్లుకు అమోఘమైన రోగ నిరోధక శక్తి ఉందన్నారు. అందుకే బాగా కల్లు తాగి కరోనా భయం నుంచి విముక్తి పొందాలని ప్రజలకు పిలుపు నిచ్చారు.