ఏపీలో కొవిడ్ టీకా డ్రైరన్ విజయవంతం

కొవిడ్ వ్యాక్సిన్కు సంబంధించి ఆంధప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో ఐదు చోట్ల ప్రారంభమైన డ్రైరన్ ముగిసింది. ఈ కార్యక్రమం విజయవంతం అయ్యిందని సంయుక్త కలెక్టర్ శివశంకర్ పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి లోటుపాట్లు కన్పించలేదని ఆయన వివరించారు. కొవిన్ పోర్టల్ పనితీరు బాగుందని జేసీ సృష్టం చేశారు. పోలింగ్ తరహాలో డ్రైరన్ పక్రియ చేపట్టామన్నారు. టీకా డ్రైరన్కు ప్రతి కేంద్రంలో ఐదుగురు సిబ్బంది, 3 గదులు ఏర్పాటు చేసినట్లు జేసీ తెలిపారు. కేంద్రం సూచనలతో వ్యాక్సినేషన్కు సిద్ధమవుతామన్నారు.
ఇకపై సమాచార విశ్లేషణ చేసే అంశంపై అధికారులు దృష్టి పెట్టనున్నట్లు వివరించారు. డ్రైరన్కు సంబంధించిన నివేదికలను అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి పంపనున్నారు. రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, కంకిపాడు మండలం ఉప్పులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సూర్యారావుపేటలోని పూర్ణా హార్ట్ ఇనిస్టిట్యూట్, కృష్ణవేణి డిగ్రీ కళాశాల, తాడిగడప సచివాలయం-4, ప్రకాష్నగర్ పీహెచ్సీలలో డ్రైరన్ కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.