SNUSA: శంకర్ సుబ్రహ్మణియన్తో ఎస్ఎన్యూఎస్ఏ మీట్ అండ్ గ్రీట్ విజయవంతం

శంకర్ నేత్రాలయ అట్లాంటా విభాగం ప్రముఖ దాత, ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి శ్రీ శంకర్ సుబ్రహ్మణియన్ (Shankar Subramonian) గారిని సత్కరించేందుకు 2025 ఏప్రిల్ 26న (శనివారం) ఒక ప్రత్యేక మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. శంకర్ సుబ్రహ్మణియన్ అట్లాంటా నివాసితులు, సమాజానికి తిరిగి ఇవ్వాలనే భావనతో, అనేక సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ అనేక సంస్థలకు ప్రోత్సాహక దాతగా నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధన కేంద్రాలను స్థాపించడంలో మరియు కొనసాగించడంలో ఆయన పాత్ర విలువైనదిగా నిలిచింది.
2022లో కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ బ్రున్స్విక్ వారు శ్రీ శంకర్ గారిని ఇంజినీరింగ్ వాల్ ఆఫ్ ఫేమ్ లో చేర్చి సత్కరించారు. 2024 సెప్టెంబర్లో, ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థుల సహకారంతో డయాబెటిక్ పై పరిశోధన కోసం శంకర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను స్థాపించారు. ఇది ఎమోరీ యూనివర్సిటీ యొక్క గ్లోబల్ డయాబెటిక్ రీసెర్చ్ సెంటర్ భాగస్వామ్యంలో పనిచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న మధుమేహ సమస్యకు శాస్త్రియ పరిష్కారాలను అందించాలనే ఉద్దేశ్యంతో ఈ కేంద్రం ఏర్పాటైంది.
తమిళనాడులోని తమ సొంత ఊరైన ఎట్టాయపురం గ్రామీణ ప్రాంత ప్రజల కోసం 350,000 డాలర్ల విరాళం అందించి, మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ ఏర్పాటు చేయడంలో శ్రీ శంకర్ గారు ముఖ్యపాత్ర పోషించారు. ఇది శంకర్ నేత్రాలయకు ఐదవ ఎమ్ఈఎస్యూ యూనిట్ కాగా, 2025 ఆగస్టులో ఇది పూర్తిగా సిద్దమై తమిళనాడు మరియు కేరళకు సేవలు అందించనుంది. ఈ యూనిట్ ద్వారా ప్రతి సంవత్సరం 80 కంటి శిబిరాలు నిర్వహించగలడం వల్ల అనేకమందికి వెలుగు పంచే అవకాశం లభించనుంది. ఈ సందర్భంగా శ్రీ శంకర్ గారి కుటుంబ సభ్యులు శ్రీమతి లక్ష్మి శంకర్, కుమార్తె అంబికా శంకర్, కుమారుడు అశోక్ కుమార్ మరియు మనవడు కార్యక్రమానికి హాజరయ్యారు.
అధ్యక్షుడు మరియు శంకర రత్న అవార్డు గ్రహీత శ్రీ బాలా ఇందుర్తి గారు, శ్రీ శంకర్ గారిని ఘనంగా సత్కరించి, ఎస్ఎన్యుఎస్ఎ యొక్క బ్రాండ్ అంబాసిడర్గా ఆయనను ప్రకటించారు. ఈ సందర్భంగా వారి మానవతా దృక్పథానికి లక్షలాది మంది కళ్లల్లో వెలుగు నింపాలనే శంకర నేత్రాలయ ఆశయానికి ఆయన అందిస్తున్న మద్దతుకు ఎస్ఎన్యుఎస్ఎ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ప్రస్తుతం శంకర్ నేత్రాలయ గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ యూనిట్ల ద్వారా కంటి శస్త్ర చికిత్సలు నిర్వహించేందుకు భారత ప్రభుత్వం నుండి అధికారికంగా అనుమతి పొందిన ఏకైక సంస్థ. ఇతర క్లిష్టమైన శస్త్రచికిత్సలు కూడా సమీపంలోని శంకర్ నేత్రాలయ ఆసుపత్రుల్లో పూర్తిగా ఉచితంగా అందించబడుతున్నాయి.
ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు శ్రీ బాలా ఇందుర్తి, కోశాధికారి శ్రీ మూర్తి రేకపల్లి, ట్రస్టీలు శ్రీనీ వంగిమల్ల, మెహర్ లంకా, డా.మాధురి నాముదూరి, సాంస్కృతిక విభాగం నీలిమ గడ్డమనుగు, క్రీడా విభాగం రమేష్ చాపరాల అడాప్ట్ ఎ విల్లేజ్ చైర్ డా. కిశోర్ రాసమళ్ళు, చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ రాజేశ్ తాడికమల్లా, మీడియా చైర్ గిరి కోటగిరి, మరియు సభ్యులు శ్రీధర్ జూలపల్లి, పాడి రావు అట్మూరి, మరియు అట్లాంటా చాప్టర్ నాయకులు శ్రీనివాస్ దుర్గం, రామ్ దుర్వాసుల, శిల్ప ఉప్పులూరి, డా. జనార్థన్ వన్నెల, రామరాజు గదిరాజు, వెంకీ నిలం, సందీప్ కొత్త, దుర్గ గోరా, బిజు దాస్ మరియు యువత విభాగం చరిత్ర జూలపల్లి గారు కలిసి విజయవంతంగా నిర్వహించారు. సింగపూర్ నుండి శ్రీ రత్నకుమార్ కవుటూరి గారు మీడియా విభాగంలో ఎనలేని సేవలందిస్తున్నారని బాలాగారు తన ప్రసంగంలో పేర్కొన్నారు.
ఈ వేడుకలో మేటి నాట్య కళాకారులు రేవతి కోమందూరి, శశికల పెనుమర్తి, నీలిమ గడ్డమనుగు, సోబియా కిషన్, జసోథ బాలసుబ్రమణ్యం నేతృత్వంలోని భరతనాట్యం, కూచిపూడి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మాధవి ఉప్పులూరి మరియు ఉష మోచెర్ల లలిత సంగీతంతో పాటు స్థానిక గాయనీ గాయకులు, జసోథ బాలసుబ్రమణ్యం విద్యార్థుల వాయిలిన్ వాయిద్య ప్రదర్శన కూడా ఆధ్యాత్మికతతో కూడిన మూడ్ను ఏర్పరిచింది. వేదికపై శ్రీ శంకర్ గారు $350,000 చెక్కును SNUSA కోశాధికారి మూర్తి రేకపల్లి గారికి అందజేశారు, SN బృందం మరియు పూజారుల సమక్షంలో. కార్యక్రమం ప్రారంభం లో అట్లాంటా హిందూ టెంపుల్ ప్రధాన పూజారి శ్రీ గోపాల్ భట్టార్ మరియు నలుగురు పూజారులు వేద మంత్రాలతో దీప ప్రజ్వలన చేశారు మరియు శంకర నేత్రాలయ సేవా మార్గానికి ఆశీర్వచనాలు అందించారు.
కార్యక్రమం ముఖ్య అతిథులుగా డా. కిషోర్ చివుకుల (బోర్డ్ ఆఫ్ అడ్వైజర్ – ఆబర్న్, అలబామా), శ్రీ శ్యామ్ అప్పలి (ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ – లాస్ ఏంజలిస్), శ్రీ అధి మొర్రెడ్డి, శ్రీమతి రేఖా రెడ్డి (ఫీనిక్స్, AZ), శ్రీమతి భాను రామకృష్ణన్ (వాషింగ్టన్ DC), డా. కేశవ్ భట్ (రాలీ, NC), మరియు ఇతరులు పాల్గొన్నారు. మెహర్ లంకా కార్యక్రమ స్థల ఎంపిక మరియు అతిథుల ఆతిథ్య ఏర్పాట్లను సమర్థంగా నిర్వహించారు. నీలిమ గడ్డమనుగు పూజారులు, కొరియోగ్రాఫర్లు, గాయనీ గాయకులు మరియు అలంకరణ బృందంతో సమన్వయం చేసారు.
ఈ సమావేశానికి హాజరైన ప్రముఖులు మరియు MESU దాతలు: డా. బీకే మోహన్, డా. సుజాత రెడ్డి, కోమటి మోహన్ రెడ్డి, రవి పోనంగి, మురళి రెడ్డి, రవి కందిమల్ల, అమర్ దుగ్గసాని, బాలరామిరెడ్డి, శ్రీకాంత్ కొండా, కిరణ్ పాశం, ప్రభాకర్ రెడ్డి ఎరగం, అనిల్ జాగర్లమూడి, భరత్ మదాడి, వంశీ మదాడి, తిరు చిల్లపల్లి, జగదీష్ చీమర్ల, నారాయణ రేకపల్లి, శీలా లింగం, అధి చిన్నతిమ్మ, గోపాల్ నాయర్, ఇందు నాయర్, ప్రవీణ్ ఆకుల, రవి గెల్లా, రాజ్ వుచాటు, రాఘవ తడవర్తి, కమల్ సాతులూరు, శ్రీరామ్ రెడ్డి పళ్ళా, మరియు డా. ప్రమోద్ రెడ్డి కైలా.
ఈ వేడుకను విజయవంతంగా నిర్వహించిన మాస్టర్స్ ఆఫ్ సెరిమనీ: శ్రీ విజు చిలువేరు మరియు శ్రీ శ్యామ్ అప్పలి. ఫోటో/వీడియో కవరేజ్: శ్రీ వెంకట్ కుట్టువా. ఫుడ్ : అచిస్ రెస్టారెంట్. ఓటు ఆఫ్ థ్యాంక్స్: శ్రీ శ్యామ్ అప్పలి.
మరిన్ని వివరాల కోసం దయచేసి మా వెబ్సైట్ను సందర్శించండి: www.SankaraNethralayaUSA.org
ఈ కార్యక్రమం మన మనసులను ఓ గొప్ప తాత్త్విక సందేశంతో అలముకున్నది — మన సహాయం, మన సమయం, మన దాతృత్వం… ఇవన్నీ కలిసివచ్చి ఎవరికైనా ఆశాజ్యోతి ప్రసరించగలవు. శ్రీ శంకర్ సుబ్రమోనియన్ గారు మనందరికీ ఒక ప్రేరణ. వారు చూపించిన దారిలో మనమందరం ముందడుగు వేయాలని, SNUSA హృదయపూర్వకంగా కోరుకుంటోంది.