షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టిన “రణబాలి” సినిమా
అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “రణబాలి” మూవీ
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ “రణబాలి” షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. మొత్తం 130 రోజుల పాటు భారీ ఎత్తున, హై క్వాలిటీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో ఈ సినిమా చిత్రీకరణ జరిపారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టినట్లు మేకర్స్ వెల్లడించారు. షూటింగ్ పూర్తయిన సందర్భంగా టీమ్ చేసుకున్న సెలబ్రేషన్స్ ను దర్శకుడు రాహుల్ సంకృత్యన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అక్టోబర్ 16న విజయదశమి పర్వదినం సందర్భంగా “రణబాలి” సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న వివాహం తర్వాత కలిసి నటిస్తున్న సినిమాగా అటు వారి ఫ్యాన్స్ లోనూ, ఇటు మూవీ లవర్స్ లోనూ “రణబాలి” సినిమా ఆసక్తి కలిగిస్తోంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ చిత్ర టీజర్ మూవీపై అంచనాలు మరింతగా పెంచేసింది. త్వరలో “రణబాలి” సినిమా నుంచి ఫస్ట్ సింగిల్..’ఏందయ్యా సామీ..’ ఫుల్ సాంగ్ రిలీజ్ చేసేందుకు టీమ్ సన్నాహాలు చేస్తున్నారు.
“రణబాలి” సినిమాను టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా “రణబాలి” సినిమా రూపొందుతోంది.








