20 కోట్లు ఎగ్గొట్టిన రియల్ హీరో సోనూ సూద్ : ఐటీ శాఖ అధికారులు వెల్లడి
చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఖర్చు చేసింది 1.9 కోట్లు మాత్రమేనట?
రియల్ హీరో సోనూసూద్కు ప్రస్తుతం ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కరోనా కష్టకాలంలో ఆపద్భాందవుడిగా సాయం చేశాడు. ఎవరికి ఏ కష్టం ఉన్నా కూడా క్షణాల్లో తీర్చేశాడు. ఎంతో మంది ఆకలిని తీర్చాడు. ఇంకెంతో మందికి ఆపరేషన్లు చేయించి జీవంపోశాడు. కరోనా కష్టకాలంలో ప్రజలకు ప్రత్యక్ష దైవంగా మారిపోయాడు. అలాంటి సోనూ సూద్ మీద ఇప్పుడు కొత్త ఆరోపణలు వస్తున్నాయి. రూ.20 కోట్లకు పైగా పన్ను ఎగవేసినట్లు శనివారం ఆదాయపన్ను(IT) విభాగం వెల్లడించింది. ఇటీవల ఐటీ విభాగం సోనూసూద్ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. రూ.20 కోట్లకు పైగా పన్ను ఎగవేసినట్లు శనివారం ఆదాయపన్ను(ఐటీ) విభాగం వెల్లడించింది. ఇటీవల ఐటీ విభాగం సోనూసూద్ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. నిన్నటి వరకు మూడురోజులు పాటు ఈ సోదాలు చేపట్టింది. పన్ను ఎగవేత ఆరోపణలతో.. అధికారులు ఆయన ఆర్థిక లావాదేవీలను పరిశీలించారు.
ఈ క్రమంలోనే ఐటీ విభాగం నుంచి ప్రకటన వెలువడింది. మొత్తంగా దాదాపు 20 కోట్లు ఎగ్గొట్టినట్టు ప్రకటించారు. ఫారిన్ కంట్రిబ్యూషన్ ( REGULATION ) యాక్ట్ను సోనూసూద్ ఉల్లంఘించారని ఐటీ శాఖ వెల్లడించింది. క్రౌడ్ ఫండింగ్ ద్వారా విదేశీ దాతల నుంచి రూ.2.1 కోట్లను సేకరించినట్లు తెలిపారు. సోనూసూద్తో పాటు ఆయన సహచరుల కార్యాలయాల్లో కూడా పన్ను ఎగవేతకు సంబంధించిన ఆధారాలను గుర్తించినట్లు వెల్లడించారు. మొదటి వేవ్ సమయంలో ఆయన ఏర్పాటు చేసిన దాతృత్వ సంస్థ రూ.18 కోట్లకు పైగా విరాళాలను సేకరించిందని అధికారులు వెల్లడించారు. అందులో రూ.1.9 కోట్లు మాత్రమే సహాయ కార్యక్రమాలకు వినియోగించారని, మిగతా డబ్బు ఆ సంస్థ ఖాతాలోనే ఉండిపోయిందని పేర్కొన్నారు.













