ఆన్లైన్లో విడుదలైన చిత్రాలకు ఆస్కార్స్
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచంపై పెను ప్రభావం పడుతోంది. దీని దెబ్బకు థియేటర్లు మూతపడ్డాయి. కొత్త చిత్రాలు విడుదలై నెలన్నర దాటింది. పలు దేశాల్లో ఇదే పరిస్థితి. అందుకని, ఆస్కార్ నిర్వాహకులు ఓ నిర్ణయం తీసుకున్నారు. ఆన్లైన్లో విడుదలైన చిత్రాలకూ అర్హత కల్పిస్తున్నారు. డిజిటల్ ప్లాట్ఫార్మస్లో విడుదలైన చిత్రాలూ ఆస్కార్స్కి ఆప్లై చేసుకోవచ్చు అన్నమాట. అయితే ఈ అవకాశం వచ్చే ఏడాదికి మాత్రమే. ఈ మార్పు తాత్కాలికమే అని నిర్వహకులు తెలిపారు. థియేటర్లు తెరుచుకున్న తర్వాత ఇప్పటివరకూ పాటించిన పద్ధతుల ప్రకారమే అవార్డులు ఇవ్వనున్నారు.













