అధ్యక్ష పీఠం కోసం మరో కుట్ర
అధికార పీఠాన్ని వదిలేది లేదంటూ భీష్మించుకు కూర్చున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ భారీ కుట్రకు సిద్ధమయ్యారు. ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్కు 306, ట్రంప్కు 232 ఓట్లు వచ్చిన విషయం తెలిసిందే. 270 మేజిక్ ఫిగర్ కోసం ఇంకా ప్రయత్నిస్తున్న ట్రంప్ తాజాగా 46 స్థానాల్లో ఎన్నికలను వివాదాస్పదం చేయాలనుకున్నారు. మిషిగాన్కు చెందిన తన పార్టీ (రిపబ్లికన్) చట్టసభ్యులను వైట్హౌస్కు పిలిపించుకున్నారు. ఆ రాష్ట్రంలో ఉన్న 16 స్థానాల్లో బైడెన్, కమల హ్యారిస్కు ఓట్లు వచ్చిన విషయాన్ని నిర్ధారించకూడదని అని తన ఖాతాలో పడ్డట్లుగానే గుర్తించాలని వారిని కోరారు. ఇదే విధంగా పెన్సిల్వేనియాలోని 20 స్థానాలు, విస్కోన్సిన్లోని 10 స్థానాలను అక్రమంగా తన ఖాతాలో వేసుకోవాలని వ్యూహం పన్నారు. అంతా అనుకున్నట్లే జరిగితే.. ట్రంప్కు వచ్చిన స్థానాల సంఖ్య 232 నుంచి 278కి పెరుగుతుంది. ట్రంప్ చర్యలు సరికావని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.






