వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు…ఇక్కడి మహిళలు ఎవరికీ తక్కువ కాదు
తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్న వైఎస్ షర్మిల టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శల జోరు పెంచుతున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లోటస్ పాండ్లో ఆమె వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ గడ్డ రాజకీయ చైతన్యానికి అడ్డా అని అన్నారు. ఇక్కడి మహిళలు ఎవరికీ తక్కువ కాదని చెప్పారు. ఈ గడ్డపై పుట్టిన రాణి రుద్రమదేవి చరిత్ర అందరికీ తెలిసిందేనని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో మహిళల పాత్ర ఎంతో ఉందని, కానీ, ప్రస్తుత తెలంగాణలో స్త్రీలకు ఉన్న ప్రాతినిధ్యం చాలా తక్కువని ఆవేదన వ్యక్తం చేశారు.
పోరాడి సాధించుకున్న తెలంగాణలో అసమానతలు ఉన్నాయని, మహిళలకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు సరైన ప్రోత్సాహాన్ని ఇవ్వడం లేదని దుయ్య•ట్టారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో ఎందరో మహిళలు మంత్రి పదవులును అలకరించారని, కేసీఆర్ ప్రభుత్వం కేవలం ఇద్దరు మహిళలు మాత్రమే మంత్రులుగా ఉన్నారని అన్నారు. ఆ ఇద్దరికీ కూడా ఐదేళ్ల తర్వాతే అవకాశం దొరికిందన్నారు. మహిళలు అన్నింటిలో సగం అయినప్పుడు.. ఈ అన్యాయం ఎందుకని ప్రశ్నించారు. మహిళల హక్కుల కోసం తాను నిలబడతానని అన్నారు.













