26న ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

ఈ నెల 26వ తేదీన తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా పల్లా రాజేశ్వర్ రెడ్డి, సురభి వాణీదేవి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మహబూబ్నగర్-రంగారెడ్డి- హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి విజయం సాధించిన విషయం తెలిసిందే. నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానంలో ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎన్నికవడం వరుసగా ఇది రెండోసారి. మండలి చైర్మన్ వీరిద్దరి చేత ప్రమాణం చేయించనున్నారు. లాక్డౌన్ నిబంధనల నేపథ్యంలో ఈ కార్యక్రమం నిరాడంబరంగా జరగనుంది.