తెలంగాణలో కరోనా ఉధృతి..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,361 కరోనా కేసులు నమోదు అయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్లో తెలిపింది. వైరస్ బారిన పడి మరో 51 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,69,722కు చేరుకుంది. ఇప్పటి వరకు 3,09,491 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 2,572 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 77,704 యాక్టివ్ కేసులున్నాయి. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,225, మేడ్చల్ జిల్లాలో 422, రంగారెడ్డి జిల్లాలో 423 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.