తెలంగాణలో 3.42 కోట్ల డోసులు పూర్తి : వైద్యారోగ్య శాఖ

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 3.43 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేయడం పూర్తయిందని వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. ప్రభుత్వ కేంద్రాల్లో 3.04 కోట్ల డోసులు, ప్రైవేటు కేంద్రాల్లో 38 లక్షల డోసులు వేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో 60 లక్షల వ్యాక్సిన్ డోసుల నిల్వ ఉన్నాయని వెల్లడిరచారు. మొదటి డోసు 84.3 శాతం మందికి పూర్తి కాగా, 38.5 శాతం మందికి రెండో డోసు పూర్తయిందని పేర్కొన్నారు. జాతీయ సగటుతో పోల్చితే ఎక్కువ శాతం వ్యాక్సినేషన్ అయినప్పటికీ, వ్యాక్సినేషన్ వేగాన్ని పెంచేందుకు వైద్యారోగ్య శాఖ సన్నద్ధమవుతున్నది.