ఎన్నికల షెడ్యూల్ విడుదల… తెలంగాణలో మే 13న పోలింగ్

సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ షెడ్యూల్ను ప్రకటించారు. తెలంగాణలో రాష్ట్రంలో మొత్తం 17 లోక్సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానాకి పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో నాలుగో విడత పోలింగ్ జరగనుందని ఆయన వెల్లడిరచారు. నాలుగో విడుతలో మే 13న లోక్సభ ఎన్నికల పోలింగ్ జరుగనున్నది. ఏప్రిల్ 18 నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగనున్నది. 26న నామినేషన్ల పరిశీలన. 29 వరకు ఉపసంహరణకు గడువు ఇచ్చింది. 13న ఎన్నికల పోలింగ్ జరుగనున్నది. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ ఉంటుందని ఈసీ ప్రకటించింది.