తెలంగాణలో పలు కార్పొరేషన్ లకు… నూతన చైర్మన్లు వీళ్లే

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు కార్పొరేషన్ లకు చైర్మన్ల నియామకంపై ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 15నే ఇందుకు సంబంధించి జీవో విడుదలైంది. అయితే, ఎన్నికల కోడ్ దృష్ట్యా ఆపి ఈరోజు తిరిగి విడుదల చేశారు. రెండు రోజుల్లో కార్పొరేషన్ చైర్మన్లు బాధ్యతలు స్వీకరించనున్నారు. 35 మంది చైర్మన్లను నియమిస్తూ జీవో విడుదల చేశారు.
వివిధ కార్పొరేషన్ల నూతన చైర్మన్లు …
విత్తనాభివృద్ధి చైర్మన్గా అన్వేష్రెడ్డి, ఆగ్రో పరిశ్రమల అభివృద్ధి – కాసుల బాలరాజు, ఆయిల్ సీడ్స్ అభివృద్ధి సంస్థ – జంగా రాఘవరెడ్డి, రాష్ట్ర సహకార సంఘం – మానాల మోహన్ రెడ్డి, గిడ్డంగుల సంస్థ – నాగేశ్వర్రావు ముదిరాజ్ కార్పొరేషన్ – జ్ఞానేశ్వర్ ముదిరాజ్, మత్స్య సహకార సమాఖ్య – మొట్టు సాయికుమార్, గ్రంథాలయ పరిషత్ – రియాజ్, అటవీ అభివృద్ధి – పొదెం వీరయ్య, కనీస వేతనాల సలహాబోర్డు – జనక ప్రసాద్, నీటి పారుదల అభివృద్ధి – విజయ్బాబు, స్పోర్ట్స్ అథారిటి – శివసేనారెడ్డి, సెట్ విన్ – గిరిధర్ రెడ్డి, హస్తకళల అభివృద్ధి – నాయుడు సత్యనారాయణ, ఖనిజాభివృద్ధి – అనిల్, టీజీఐఐసీ – నిర్మలా జగ్గారెడ్డి, వాణిజ్య ప్రోత్సాహక – ప్రకాశ్ రెడ్డి, సాంకేతిక సేవల అభివృద్ధి సంస్థ – మన్నె సతీష్ కుమార్, పట్టణ ఆర్థిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ – చల్లా నరసింహారెడ్డి, శాతవాహన పట్టణాభివృద్ధి సంస్థ – కె.నరేందర్ రెడ్డి, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ – ఈ.వెకంటరామిరెడ్డి, రహదారి అభివృద్ధి సంస్థ – మల్రెడ్డి రామిరెడ్డి, పర్యాటక అభివృద్ధి సంస్థ – పటేల్ రమేశ్ రెడ్డి, తెలంగాణ ఫుడ్స్ – ఎం.ఎ.ఫహిమ్, ఆర్యవైశ్య కార్పొరేషన్ – కాల్వ సుజాత, బీసీ కార్పొరేషన్ – నూతి శ్రీకాంత్, ఎస్సీ కార్పొరేషన్ – ఎన్.ప్రీతం. ఎస్టీ కార్పొరేషన్ – బెల్లయ్య నాయక్, గిరిజన కార్పొరేషన్ – కె.తిరుపతి, ఎంబీసీ కార్పొరేషన్ – జైపాల్, మహిళా సహకార అభివృద్ధి సంస్థ – శోభారాణి, వికలాంగుల కార్పొరేషన్ – ఎం.వీరయ్య, సంగీత నాట్య అకాడమీ – అలేఖ్య పుంజాల, మైనార్టీ కార్పొరేషన్ వైస్ చైర్మన్గా ఎం.ఎ. జబ్బార్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్వరులు జారీ చేసింది.