Polavaram Project : తెలంగాణపై ఆ ప్రాజెక్టు ప్రభావం :సీఎం రేవంత్

పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) కారణంగా తెలంగాణపై పడే ప్రభావాన్ని అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఐఐటీ హైదరాబాద్ (IIT Hyderabad) బృందంతో అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy ) అధికారులను ఆదేశించారు. నెల రోజుల్లో సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని సూచించారు. ఐఐటీ హైదరాబాద్ బృందంతో సమన్వయం చేసుకునేందుకు ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు. భద్రాచలం ఆలయానికి (Bhadrachalam Temple) ముప్పు ఏర్పడే అవకాశాలపై ఈ బృందం అధ్యయనం చేయనుంది. 2022లో వచ్చిన వరదల వల్ల భద్రాచలం ముంపునకు గురైందని, 27 లక్షల క్యూసెక్యుల వరద నీరు వచ్చిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా బనకచర్ల ప్రాజెక్టు చేపడుతోందని, ఆ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవని అధికారులు సీఎంకు వివరించారు. తెలంగాణ అభ్యంతరాలను ఏపీ సీఎస్కు తెలపాలని, అవసరమైతే గోదావరి బోర్డు, కేంద్ర జలశక్తిశాఖకు లేఖలు రాయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.