ఆటో, క్యాబ్ డ్రైవర్లకు కోవిడ్ వాక్సినేషన్ : సోమేశ్ కుమార్

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు, హైరిస్క్ గ్రూపులకు చెందిన ఆటో, క్యాబ్, మ్యాక్స్ క్యాబ్ డ్రైవర్లకు జి.హెచ్.యం.సి పరిధిలో 10 సెంటర్ల ద్వారా 20 రోజుల పాటు స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ లో బాగంగా 2 లక్షలకు పైగా వ్యాక్సినేషన్ ను అందించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ తెలిపారు. High exposure గ్రూపులకు వ్యాక్సినేషన్ డ్రైవ్ ను చేపట్టామన్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గురువారం క్యాబ్, ఆటో, వ్యాక్సినేషన్ సెంటర్ ను తనిఖీచేశారు. లైసెన్స్ కలిగిన డ్రైవర్లు రవాణా శాఖ వెబ్ సైట్ లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని అధికారులు ప్రధాన కార్యదర్శి కి వివరించారు. వారి మోబైల్ కు మెసేజ్ వస్తుందని, మెసేజ్ వచ్చిన వారికి మాత్రమే వ్యాక్సినేషన్ సెంటర్ లో అనమతినిస్తున్నమన్నారు. వ్యాక్సినేషన్ సెంటర్లలో కొవిన్ పోర్టల్ లో డ్రైవర్ల రిజిస్ట్రేషన్ చేస్తారని, నేరుగా వచ్చే వారికి వ్యాక్సినేషన్ ఇవ్వడం లేదన్నారు.
వ్యాక్సినేషన్ డ్రైవ్ కోసం రవాణాశాఖ చేపట్టిన సదుపాయాల పట్ల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వారిని అభినందించారు.
ఈ కార్యక్రమంలో రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ సునీల్ శర్మ, నగర పోలీస్ కమీషనర్ శ్రీ అంజనీ కుమార్, వైద్య శాఖ కార్యదర్శి శ్రీ రిజ్వీ, రవాణా శాఖ కమీషనర్ శ్రీ యం.ఆర్.యం. రావు, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీమతి శ్వేతా మహంతి, తదితర అధికారులు పాల్గొన్నారు.