24 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

ఈ నెల 24వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వివిధ శాఖల అధికారులతో అసెంబ్లీ నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్తో పాటు ప్రభుత్వ విప్లు రామచంద్ర నాయక్, ఆది శ్రీనివాస్తో పాటు పలువురు హాజరయ్యారు. కానీ ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయనే విషయంపై స్పష్టత రాలేదు. ఈ సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జుట్ను ప్రవేశపెట్టనున్నారు. అలాగే రైతు భరోసా పథకంపై కీలకమైన చర్చ జరిగే అవకాశం ఉన్నది. జాబ్ క్యాలెండర్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం సమావేశాల్లో ప్రకటించే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.