Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. హాజరైన సీఎం రేవంత్, కేసీఆర్
తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు దివంగత మాజీ ఎమ్మెల్యేలు రాంరెడ్డి దామోదర్ రెడ్డి (Ramreddy Damodar Reddy), కొండా లక్ష్మారెడ్డిలకు సంతాప తీర్మానాలను సభలో ప్రవేశపెట్టారు. అనంతరం సభ్యులు సంతాపం తెలిపారు. ఈ సమావేశాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ప్రతిపక్ష నేత కేసీఆర్తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కేసీఆర్ వద్దకు రేవంత్ రెడ్డి వెళ్లి బాగున్నారా అని పలకరించారు. ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, శ్రీధర్బాబు, అడ్లూరి లక్ష్మణ్, సీతక్క, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆయనకు పలకరించి అభివాదం చేశారు. సంతాప తీర్మానాల అనంతరం కేసీఆర్ సభ నుంచి వెళ్లిపోయారు.






