తెలంగాణ ఏసీబీకీ సుప్రీంకోర్టు నోటీసులు…

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఓటుకు నోటు కేసులో విచారణ పూర్తయ్యే వరకు సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ నిలిపివేయాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ఏసీబీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణ వాయిదా విచారణ పూర్తయ్యే వరకు క్రాస్ ఎగ్జామినేషన్ నిలిపివేయాంటూ గవాయ్, సూర్యకాంత ధర్మాసనం సృష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఓటుకు నోటు కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నాంపల్లిలోని పీఎంఎల్ఏ ప్రత్యేక న్యాయస్థానంలో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఎంపీ రేవంత్రెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్, ఉదయ్సింహ, మత్తయ్య జెరూసలేం, వేం కృష్ణకీర్తన్ పై అభియోగాలు నమోదు చేసింది. ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా మనీలాండరింగ్ కోణంలో ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. 2015 జూన్ 1న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మేం నరేందర్ రెడ్డికి అనుకూలంగా ఓటు వేయడం, లేదా ఓటింగ్కు గైర్హాజరు కావాలని అందుకు నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్వీ స్టీఫెన్సన్కు రూ.50 లక్షలు ఇవ్వజూపగా ఏసీబీ రెడ్హ్యాండెడ్గా పట్టుకుని కేసు పెట్టింది.