నల్లగొండ అసెంబ్లీకి శ్రీనివాస్ సతీమణి?
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవల హత్యకు గురైన కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ సతీమణి, నల్లగొండ మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మిని నల్లగొండ నుంచి అసెంబ్లీ బరిలో దింపాలని యోచిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్మే కోమటిరెడ్డిని నల్లగొండ నుంచి లోక్సభ స్థానంలో బరిలోకి దింపాలని నిర్ణయించినట్టు సమాచారం. లోక్సభకు పోటీ చేసేందుకు కోమటిరెడ్డి కూడా అంగీకరించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన చేయించాలని టీపీసీసీ భావిస్తోంది.













