కామన్వెల్త్ కాన్ఫరెన్స్కు స్పీకర్, మండలి చైర్మన్

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగే 67వ కామన్వెల్త్ పార్లమెంట్ కాన్ఫరెన్స్లో పాల్గొనడానికి తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి బృందం నేటి నుంచి అధికారిక విదేశీ పర్యటనకు వెళుతున్నారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ముదిరాజ్, శాసనసభ కార్యదర్శి డాక్టర్ వి. నరసింహాచార్యులు తదితరులు శంషాబాద్ విమానాశ్రయం నుంచి సిడ్నీకి బయలుదేరుతారు. అనంతరం స్టడీ టూర్లో భాగంగా న్యూజిలాండ్, జపాన్, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటిస్తారు.