దీపావళి కానుకగా.. సింగరేణి కార్మికులకు

దీపావళి కానుకగా సింగరేణి కార్మికులకు బోనస్ను శుక్రవారమే చెల్లిస్తున్నామని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సచివాలయంలో ప్రకటించారు. దీని కోసం సింగరేణి సంస్థ రూ.358 కోట్లను విడుదల చేయాలని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో సింగరేణిపై జరిగిన సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి ఆదేశాలు జారీ చేశారు. గత ఏడాది చెల్లించిన దీపావళి బోనస్ కన్నా ఇది రూ.50 కోట్లు అధికం కావడం విశేషం. శుక్రవారం మధ్యాహ్నం సమయానికి దీపావళి బోనస్ను కార్మికుల ఖాతాల్లో జమ చేయాలన్నారు. దీపావళి బోనస్ కింద ఒక్కొక్క కార్మికుడు రూ.93,750లు అందుకోనున్నారు. సంస్థలో పనిచేస్తున్న దాదాపు 40,000 మంది కార్మికులకు ఈ బోనస్ అందనుంది.