నిబంధనలు లేకుండా తక్షణ సాయం చేయండి : సీఎం రేవంత్ విజ్ఞప్తి

తెలంగాణలో వరదల నివారణకు శాశ్వత చర్యలు తీసుకోవాని కేంద్ర బృందాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. రాష్ట్రంలో వరద నష్టం అంచనాపై సచివాలయంలో కేంద్ర బృందంతో ఆయన సమావేశమయ్యారు. వరదల నివారణకు శాశ్వత నిధి ఏర్పాటు చేయాలన్నారు. శాశ్వత పరిష్కారానికి కార్యాచరణ ఉండాలన్నారు. రాష్ట్రంలో జరిగిన వరద నష్టాన్ని కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు. నిబంధనలు లేకుండా తక్షణ సాయం నిధుల విడుదలకు విజ్ఞప్తి చేశారు. మున్నేరు వాగుకు రిటైనింగ్ వాల్ నిర్మిస్తే వరద సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ సమవేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ రఘురాంరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి పాల్గొన్నారు.