పాతబస్తీ పరిస్థితిపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు

లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలన్నీ పోటాపోటీగా ఎన్నికల ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లోని ఎల్బీనగర్లో నిర్వహించిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ప్రధాని మోదీ.. నగరంలోని పాతబస్తీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటు బ్యాంకు పెంచుకునేందుకే కాంగ్రెస్ సర్కార్.. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను ముస్లింలకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. పాతబస్తీలో ఈనాటికీ కనీస సౌకర్యాలు లేవని, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా ఈ ప్రాంత సమస్యలను మాత్రం పరిష్కరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘చిన్న వర్షానికే ఈ ప్రాంతం నీట మునుగుతోంది. పవర్ కట్ కారణంగా రోజూ ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వచ్చినా పరిస్థితి మారలేదు. అందుకే ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి. హైదరాబాద్తో పాటు పాతబస్తీని అభివృద్ధి చేసే బాధ్యత మాది. ఇది మోదీ గ్యారంటీ’’ అని పాతబస్తీ ప్రజలకు ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు.
కాంగ్రెస్తో సమస్యలు పెరుగుతాయే కాని, పరిష్కారం కావన్న మోదీ.. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మిడిల్ క్లాస్ ప్రజలను అవమానించేలా మాట్లాడేవారని, ఇక ఈ సారి మేనిఫెస్టోలో మిడిల్ క్లాస్ ప్రజలకు కావాల్సిన ఎలాంటి అంశం లేదని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, ఇండియా కూటమితో చాలా జాగ్రత్తగా ఉండాలని, తాత, తండ్రులు సంపాదించిన ఆస్తిని వారసులకు దక్కకుండా చేస్తోన్న కాంగ్రెస్ లాంటి పార్టీ మనకు అవసరమా? అంటూ ప్రజలను ప్రశ్నించారు.