జేఎన్ టీయూలో అమెరికా పెన్ స్టేట్ యూనివర్సిటీ ప్రతినిధులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జేఎన్టీయూ ఉపకులపతి ఆచార్య జివిఆర్ శ్రీనివాసరావు వర్సిటీ ఉన్నతాధికారులతో కలిసి అమెరికా పెన్స్టేట్ యూనివర్సిటీ ప్రతినిధులతో కాన్పరెన్స్ హాల్లో భేటీ అయ్యారు. జేఎన్టీయూలో జరిగిన ఈ భేటీలో డిగ్రీ ప్రోగ్రాం, పరిశోధనలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా జేఎన్టీయూ వీసీ మాట్లాడుతూ డిగ్రీ ప్రోగ్రాం, పరిశోధన సహకారం ప్యాకల్టీ ఎక్సేజ్ తదితర అంశాలపై చర్చించామన్నారు.
ఈ కార్యక్రమంలో పెన్ స్టేట్ యూనివర్సిటీ ప్రతినిధులు డాక్టర్ హమీద్ అన్సార్, డాక్టర్ వెంకటరామన్, డాక్టర్ సాయి రామ్, డాక్టర్ టాడా క్లార్క్, టివిరెడ్డి, యూనివర్సిటీ రెక్టార్ ఎం.విజయ కుమార్, రిజిస్ట్రార్ సి.శశిధర్, ఫారిన్ ఆఫైర్స్ డైరెక్టర్ పి.సుజాత, వి సుమలత, ఇ.కేశవరెడ్డి, సి.శోభాబిందు నగరు, ఎన్. విశాలి, విబి. చిత్ర. కళాశాల ప్రిన్సిపాల్ ఎస్వి. సత్యనారాయణ, వైస్ ప్రిన్సిపాల్ ఇ.అరుణ కాంతి. వివిధ విభాగాల ఆధిపతులు పాల్గొన్నారు.