కొండా సురేఖకు నోటీసులు జారీ చేసిన నాంపల్లి కోర్టు

సీనియర్ కాంగ్రెస్ నేత, తెలంగాణ మంత్రి కొండా సురేఖకు నాంపల్లి ప్రత్యేక కోర్టు నుంచి నోటీసులు అందాయి. నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం కేసులో ఆమెకు ఈ నోటీసులు అందినట్లు సమాచారం. సురేఖకు నోటీసులు జారీ చేసిన అనంతరం తదుపరి విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు నాంపల్లి కోర్టు ప్రకటించింది. నాగార్జున దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఈరోజు రెండో సాక్షి స్టేట్మెంట్ను కోర్టు రికార్డ్ చేసింది. రెండు రోజుల క్రితమే నాగార్జున, మొదటి సాక్షి సుప్రియ స్టేట్మెంట్ను రికార్డ్ చేసిన సంగతి తెలిసిందే. కొండా సురేఖ తన కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్ఠను దెబ్బతీసేలా నిరాధార ఆరోపణలు చేశారని, దీనిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరిన నాగార్జున.. పరువు నష్టం కేసు వేశారు. ఇటీవల నాగచైతన్య, సమంత విడాకులపై కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.