ఆ కుటుంబాలను ఆదుకుంటాం : మంత్రి శ్రీధర్బాబు

తెలంగాణ రాష్ట్రంలో వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలపై అధికారులతో సమీక్షించినట్లు రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎనిమిది జిల్లాలపై తీవ్ర వర్ష ప్రభావం పడిరదన్నారు. వర్షాలతో ఇప్పటి వరకు 16 మంది మృతి చెందారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. అధికారులంతా క్షేత్రస్థాయిలో ఉండి పరిస్థితులను సమీక్షించాలి. విద్యుత్తు, రహదారులను వెంటనే పునరుద్ధరించాలని కోరాం. రాష్ట్ర స్థాయిలో డిజాస్టర్ రెస్పాన్స్ బృందాన్ని ఏర్పాటు చేస్తాం. పది బృందాలను అత్యవసర పరిస్థితుల్లో వాడుకోవాలని నిర్ణయించాం. ప్రతిపక్ష నేతలు కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలి అని విజ్ఞప్తి చేశారు.