తెలంగాణలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు కృషి చేస్తా : రామ్మోహన్ నాయుడు

చంద్రబాబు హయాంలోనే శంషాబాద్ ఎయిర్పోర్టుకు బీజం పడిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. అప్పుడు ఇంత భూమి ఎందుకు కేటాయించారని పలువురు విమర్శలు చేశారన్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏవియేషన్ సెక్యూరిటీ కల్చర్ వీక్ నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ చంద్రబాబు దూరదృష్టితోనే శంషాబాద్ విమానాశ్రయానికి అంతర్జాతీయ స్థాయిలో పేరు వచ్చిందని తెలిపారు. తెలంగాణలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటును పరిశీలిస్తామన్నారు. విమానాశ్రయాల భద్రతలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రయాణికులు సైతం విమానాశ్రయాల్లో తనిఖీలు, భద్రత పట్ల అవగాహన కలిగి ఉండి, భద్రతా సిబ్బందికి సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఒక్క యొక్కలు నాటాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారని తెలిపారు. పర్యావరణ పరిక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కేంద్రమంత్రి సూచించారు.