ఆ పార్టీ ఒక్క సీటు గెలిస్తే.. తాను దేనికైనా సిద్ధమే : మంత్రి కోమటిరెడ్డి

మతాలు, కులాల మధ్య బీజేపీ చిచ్చు పెడుతోందని తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పదేళ్లు సీఎంగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్లో ఏక్నాథ్ శిందేలు ఎవరూ లేరని, ఆయన్ను సృష్టించిందే బీజేపీ అని వ్యాఖ్యానించారు. తామంతా రేవంత్ నాయకత్వంలో పని చేస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు, బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. కాంగ్రెస్ అంతర్గత విషయాలు మాట్లాడొద్దని మహేశ్వర్ రెడ్డికి హితవు పలికారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క ఎంపీ సీటు కూడా రాదని కోమటిరెడ్డి జోస్యం చెప్పారు. ఆ పార్టీ ఒక్క సీటు గెలిస్తే, తాను దేనికైనా సిద్ధమేనన్నారు.