14న యాదాద్రికి జస్టిస్ ఎన్వీ రమణ…

భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ ఈ నెల 14న యాదాద్రిలో పర్యటించనున్నారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సీజేఐతో పాటు యాదాద్రికి వెళ్లనున్నారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం సీజేఐ, గవర్నర్, సీఎం కలిసి యాదాద్రిలో జరుగుతున్న ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు. అనంతరం నిర్మాణం పూర్తయిన ఈవో నూతన కార్యాలయాన్ని ప్రారంభిస్తారు.
తొలిసారిగా సీజేఐ యాదాద్రి సందర్శన సందర్భంగా జిల్లా మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డి, సీఎంవో ప్రధాన కార్యదర్శి భూపాల్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్ రెడ్డి తదితరులు ఆలయన నిర్మాణ పనులను పరిశీలించారు. ఘన స్వాగతం పలికేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు. యాదాద్రి ఆలయ నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్, వైటీడీఏ అధికారులు ఉన్నారు.