మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు : జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి

తెలంగాణలో విద్యుత్ కొనుగోళ్ల అంశంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసులు ఇచ్చినట్లు జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి తెలిపారు. యాదాద్రి విద్యుత్కేంద్రం నిర్మాణం, ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోలుకు గత ప్రభుత్వం అనుసరించిన విధానంపై విచారణకు ఏర్పాటైన జస్టిస్ నరసింహారెడ్డి జ్యుడిషియల్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. ఈ అంశంలో కేసీఆర్, సురేశ్ చందా, అజయ్ మిశ్రా సహా 25 మందికి నోటీసులు ఇచ్చినట్లు జస్టిస్ నరసింహారెడ్డి పేర్కొన్నారు. వివరణ ఇచ్చేందుకు కేసీఆర్ జులై 30 వరకు సమయం అడిగారని చెప్పారు. జూన్ 15 లోపు వివరణ ఇవ్వాలని కేసీఆర్కు తెలిపినట్లు వెల్లడిరచారు.