తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ
తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. మొత్తం 26 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. నీటిపారుదలశాఖ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా, పైనాన్స్ కమిషనర్ సభ్య కార్యదర్వి స్మిత సభర్వాల్, పురావస్తుశాఖ డైరెక్టర్గా భారతి హోళికేరి, గనులశాఖ ముఖ్య కార్యదర్శిగా మహేశ్ దత్ ఎక్కా, ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శిగా అహ్మద్ నజీద్, బీసీ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శిగా బుర్రా వెంకటేశం, జీఏడీ కార్యదర్శిగా ఎం. రఘునందన్రావు, పంచాయతీరాజ్, ఆర్డీ, కార్యదర్శిగా సందీప్ సుల్తానియా, ఆయుష్ డైరెక్టర్గా ఎం.ప్రశాంతి, ఫైనాన్స్, ప్లానింగ్, ప్రత్యేక కార్యదర్శిగా కృష్ణభాస్కర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా కె.శశాంక, నల్గొండ కలెక్టర్గా హరిచందన, జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్గా బి.ఎం. సంతోష్, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్గా అద్వైత్ కుమార్ సింగ్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్గా వల్లూరి క్రాంతి, పాడి పరిశ్రమ అభివృద్ధి సమాఖ్య డైరెక్టర్గా చిట్టెం లక్ష్మి, కార్మిక శాఖ కార్యదర్శిగా కృష్ణ ఆదిత్య, పీసీబీ సభ్య కార్యదర్శిగా బుద్ధ ప్రకాశ్, మైనార్టీ గురుకులాల సొసైటీ కార్యదర్శిగా ఎ.ఎం.ఖానమ్, టీఎస్ఎంఎస్ఐడీ ఎండీగా ఆర్.వి.కర్ణన్, సీఎంవో జాయింట్ సెక్రటరీగా సంగీత సత్యనారాయణ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.













