తెలంగాణలో ఐఏఎస్ల బదిలీలు

తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ టి.కె.శ్రీదేవిని ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్గా బదిలీ చేశారు. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్గా రిజ్వీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. విపత్తుల నిర్వహణ విభాగం సంయుక్త కార్యదర్శి ఎస్.హరీశ్కు రవాణా, ఆర్అండ్బీ సంయుక్త కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. మార్కెటింగ్ శాఖ డైరెక్టర్గా ఉదయ్కుమార్కు అదనపు బాధ్యతలు కేటాయించారు. పురపాలక శాఖ ఉపకార్యదర్శిగా ప్రియాంక. హాకా ఎండీగా చంద్రశేఖర్ రెడ్డి, మార్క్ఫెడ్ ఎండీగా శ్రీనివాస్ రెడ్డి, రవాణా, అర్అండ్బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వికాస్రాజ్ బదిలీ అయ్యారు.