హైదరాబాద్ విద్యార్థినికి భారీ ఆఫర్ .. రూ. 2 కోట్లతో

తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్కు చెందిన నర్కుటి దీప్తి అమెరికాలోని మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగానికి ఎంపికయ్యారు. క్యాంపస్ ఇంటర్వ్యూలో భాగంగా రూ.2 కోట్ల వార్షిక వేతనం అందుకోనున్నారు. దీప్తి యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాలో సీటు సాధించారు. ఇలా అమెరికా వెళ్లిన ఆమె ఎంఎస్ (కంప్యూటర్స్) ఈ నెల 2తో పూర్తి చేశారు. దీనికి ముందే ఆ యూనివర్సిటీలో క్యాంపస్ ఇంటర్వ్యూలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే దీప్తికి మైక్రోసాఫ్ట్, గోల్డ్ మెన్ సాక్స్, అమేజాన్ కంపెనీల్లో ఉద్యోగం వచ్చింది. ఈమె మాత్రం మైక్రోసాఫ్ట్ సంస్థ వైపే మొగ్గు చూపారు. దీప్తి ప్రతిభను గుర్తించిన మెట్రోసాఫ్ట్ ప్రతినిధులు సాప్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజినీర్ (ఎస్డీఈ) గ్రేడ్ 2 కేటగిరిలో ఎంపిక చేసుకుంటూ రూ.2 కోట్ల వార్షిక ప్యాకేజ్ ఇచ్చారు. ఈ నెల 17న మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో దీప్తి బాధ్యతలు స్వీకరించనున్నారు. దీప్తి తండ్రి, ఫోరెన్సిక్ నిపుణుడు డాక్టర్ వెంకన్న హైదరాబాద్ పోలీసు కమిషనరేట్లోని క్లూస్ టీమ్స్ కు నేతృత్వం వహిస్తున్నారు.