వైద్య విద్య యుద్దం సక్సెస్!

ఆ వైద్య విద్యార్థుల లక్ష్యం ప్తూయింది. రష్యా దాడులతో ఉక్రెయిన్లో బిక్కుబిక్కుమంటూ గడిపి, వైద్యవిద్యను మధ్యలోనే వదిలేసి భారత్కు తిరిగొచ్చిన ఆ విద్యార్థులు ఉజ్బెకిస్థాన్లో ఎంబీబీఎస్ను పూర్తి చేశారు. ఈ మేరకు గచ్చిబౌలిలోని ఏఐజీలో జరిగిన గ్రాడ్యుయేషన్ సెర్మనీ కార్యక్రమంలో 81 మందికి పట్టాలు పంపిణీ చేశారు. అప్పట్లో యుద్ధంతో ఉక్రెయిన్లో భీతావహ పరిస్థితులు నెలకొనడంతో 20 మంది వైద్య విద్యార్థులు రెండో సెమిస్టర్ మధ్య లోనే స్వదేశానికి తిరిగొచ్చారు. ప్రత్యేక చొరవ తీసుకున్న భారత ప్రభుత్వం, ఉజ్బెకిస్థాన్ విదేశీ మంత్రిత్వ శాఖతో మాట్లాడి ఆ దేశంలో వైద్య విద్యను పూర్తిచేసేందుకు అవకాశం కల్పించింది. వీరిలో 110 మంది ఎఫ్ఎంజీఈ పరీక్ష రాయగా, 81 మంది తొలిప్రయత్నంలోనే ఉత్తీర్ణులయ్యారు.