జైలుకు పంపినా వెళ్తాను గానీ.. పార్టీ మారబోను

తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమవుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో తనను ఇరికిచేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. జైలుకు పంపినా వెళ్తాను గానీ, పార్టీ మారబోనని అన్నారు. గతంలో రైతుల కోసం పోలీసులతో దెబ్బలు తిని జైలుకు వెళ్లినట్టు గుర్తు చేశారు. హామీలను అమలు చేయాలని అడిగితే కేసులతో భయపెడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ను మళ్లీ టీఆర్ఎస్గా మార్చాలని ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు.